తెలంగాణలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు.. కొత్తగా..!

ABN , First Publish Date - 2021-12-19T04:12:50+05:30 IST

తెలంగాణలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 12 ఒమైక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకూ...

తెలంగాణలో పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు.. కొత్తగా..!

హైదరాబాద్: తెలంగాణలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 12 ఒమైక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకూ మొత్తం 20 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒమైక్రాన్‌ ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. 


రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతుండడంతో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఒమైక్రాన్‌ కట్టడికి తీసుకోవలసిన ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. కేసులు, వ్యాక్సినేషన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకోవాలసిన చర్యలను వివరించారు. ఒమైక్రాన్‌‌పై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. కేసులు పెరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

 


Updated Date - 2021-12-19T04:12:50+05:30 IST