ఒమిక్రాన్ కేసులలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకున్నవారే : అమెరికా
ABN , First Publish Date - 2021-12-12T05:37:14+05:30 IST
కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ అమెరికాలో దడ పుట్టిస్తోంది. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ...
కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ అమెరికాలో దడ పుట్టిస్తోంది. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ. అమెరికాలోని మొత్తం 22 రాష్ట్రాలలో ఈ కేసులు నమోదయ్యాయి.
అమెరికా సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తాజా నివేదిక ప్రకారం దేశంలో ఇప్పటివరకు 43 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. వీటిలో 34 మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారున్నారు. వీరిలో 14 మంది బూస్టర్ డోసు(మూడో డోసు) కూడా తీసుకున్నవారు ఉండడం గమనార్హం. ఈ 43 కేసులలో 25 మంది 18 నుంచి 39 వయసు కలవారున్నారు. కేవలం ఆరుగురు మాత్రమే ఇంతకుముందు కరోనా సోకిన వారున్నారు.
సంఖ్యాపరంగా ఈ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. సిడిసి నివేదికలో గణాంకాలను చూస్తే.. అసలు ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? వ్యాక్సిన్ల ప్రభావం ఒమిక్రాన్పై ఉంటుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.