Keralaలో 94 శాతం పాజిటివ్ శాంపిల్స్‌లో ఒమైక్రాన్

ABN , First Publish Date - 2022-01-28T17:11:31+05:30 IST

కేరళ రాష్ట్రంలో 94 శాతం పాజిటివ్ శాంపిల్స్ లలో ఒమైక్రాన్ వేరియెంట్ ను కనుగొన్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు....

Keralaలో 94 శాతం పాజిటివ్ శాంపిల్స్‌లో ఒమైక్రాన్

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో 94 శాతం పాజిటివ్ శాంపిల్స్ లలో ఒమైక్రాన్ వేరియెంట్ ను కనుగొన్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఒమైక్రాన్ ఇన్పెక్షన్లు పెరుగుతున్నాయని మంత్రి చెప్పారు. కేరళలో మూడో వేవ్ ఒమైక్రాన్ వేరియెంట్ గా స్పష్టమైందని వీణాజార్జ్ చెప్పారు. డెల్టా వైరస్ 6 శాతం అని తేలిందని మంత్రి పేర్కొన్నారు.కేరళలో గురువారం 51,739 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి కేరళకు వచ్చిన వారిలో కొవిడ్ -19 నమూనాలను సీక్వెన్స్ చేయడం వల్ల వారిలో 80 శాతం మంది ఒమైక్రాన్ వేరియంట్‌తో ప్రభావితమయ్యారని, 20 శాతం మందికి డెల్టా వైరస్ సోకినట్లు తేలిందని వీణాజార్జ్ వివరించారు.


Updated Date - 2022-01-28T17:11:31+05:30 IST