ఒమైక్రాన్ ఎఫెక్ట్.. క్రిస్మస్‌కు ముందు లాక్‌డౌన్..నెదర్‌ల్యాండ్స్ ప్రభుత్వం నిర్ణయం!

ABN , First Publish Date - 2021-12-20T03:08:24+05:30 IST

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌ ఎటువంటి ప్రభావం చూపనుందో తెలియక ఐరోపా దేశాలు హడలిపోతున్నాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని ఎలాగైనా నిరోధించేందుకు కఠిన ఆంక్షలకు తెరలేయి. తాజాగా నెదర్‌ల్యాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బార్స్, రెస్టారెంట్లు, ఇతరు షాపులు జనవరి 14 వరకూ మూసివేయాలని శనివారం ఆదేశించింది.

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. క్రిస్మస్‌కు ముందు లాక్‌డౌన్..నెదర్‌ల్యాండ్స్ ప్రభుత్వం నిర్ణయం!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌ ఎటువంటి ప్రభావం చూపనుందో తెలియక ఐరోపా దేశాలు హడలిపోతున్నాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని ఎలాగైనా నిరోధించేందుకు కఠిన ఆంక్షలకు తెరలేయి. తాజాగా నెదర్‌ల్యాండ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బార్స్, రెస్టారెంట్లు, ఇతరు షాపులు జనవరి 14 వరకూ మూసివేయాలని శనివారం ఆదేశించింది. అత్యవసర వస్తువులు విక్రయించే షాపులు మినహా మిగతా అన్ని వ్యాపారాలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు దేశ ప్రధాని మార్క్ రట్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీలు, స్కూళ్లు కూడా మూసివేయాలని ఆయన స్పష్టం చేశారు. ‘‘రేపటి(ఆదివారం) నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించబోతున్నాం..’’ అంటూ విస్పష్ట ప్రకటన చేశారు. ఒమైక్రాన్ కారణంగా ముంచుకొస్తున్న కరోనా ఐదో వేవ్ ఫలితంగా ఈ లాక్‌డౌన్ తప్పదని ఆయన పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్ ఉందనగా.. లాక్ డౌన్ విధించడంతో అక్కడి ప్రజలు నిరాశానిస్పృహలకు లోనవుతున్నారు. 

Updated Date - 2021-12-20T03:08:24+05:30 IST