4 నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
ABN , First Publish Date - 2021-03-01T06:50:03+05:30 IST
4 నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
తొర్రూరు, ఫిబ్రవరి 28 : తొర్రూరు డివిజన్ కేంద్రంలో మార్చి 4, 5, 6, 7 తేదీల్లో 47వ రాష్ట్రస్థాయి జూనియర్ అండర్ 20 బాల బాలికల కబడ్డీ సెలక్షన్లు, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి తోట సురేష్ తెలిపారు. ఆదివారం పట్టణకేంద్రంలోని యతిరాజారావు పార్కులో క్రీడలకు స్థల పరిశీలన చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి 68 టీంలు పాల్గొంటాయని పగలు, రాత్రి మ్యాచ్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు 22, 23, 24 తేదీల్లో సూర్యాపేటలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తామన్నారు. 816 మంది క్రీడాకారులు, 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, న్యాయ నిర్ణేతలు ఉంటారని, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టోర్నమెంట్కు చైర్మన్గా వ్యవహరిస్తారన్నారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్, ఎంపీపీ టీసీ అంజయ్య, రైతు బందు కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్యాం సుందర్ రెడ్డి, కౌన్సిలర్ నట్వర్, నాయకులు కుమారస్వామి, యాకాంబ్రం, బిందు శ్రీను, వెంకటనారాయణ గౌడ్, రమేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.