గుజరాత్‌ తీరంలో రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌

ABN , First Publish Date - 2022-04-30T08:24:53+05:30 IST

గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టులో రూ.2080 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు.

గుజరాత్‌ తీరంలో రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టులో రూ.2080 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఇందులో పాకిస్థాన్‌-దుబాయ్‌-అఫ్ఘానిస్థాన్‌ ముఠాల భాగస్వామ్యం ఉందని గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన పడవలో డ్రగ్స్‌తో పట్టుబడిన నిం దితుల్లో కీలక వ్యక్తి అఫ్ఘాన్‌కు చెందినవాడన్నారు. 81 కిలోల హెరాయిన్‌ను నీటిలో కలిపి, ప్యాకింగ్‌ చేసిన అనంతరం గోనెసంచుల్లో దేశంలోకి తరలించేందుకు యత్నించారని వివరించారు. 


Updated Date - 2022-04-30T08:24:53+05:30 IST