గోదావరిలో దూకి ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-22T05:16:33+05:30 IST
బాసర గోదావరిలో దూకి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రేమ్దీప్ తెలిపారు. గోదావరి నది రెండో ఘాట్ వద్ద మృతదే హం ఒడ్డుకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించా రు.
బాసర, జనవరి 21 : బాసర గోదావరిలో దూకి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రేమ్దీప్ తెలిపారు. గోదావరి నది రెండో ఘాట్ వద్ద మృతదే హం ఒడ్డుకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించా రు. మృతదేహాన్ని పరిశీలించగా ఆధారాలు దొరకకపోవడంతో గుర్తుతెలియని మృత దేహంగా గుర్తించామని తెలిపారు. మృతుడి ఒంటిపై నీలంరంగు ప్యాంటు, తెల్లని గీ తల షర్టు ఉందని సుమారు 45 ఏళ్లపైబడిన వ్యక్తి అని అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.