జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-07-06T11:14:01+05:30 IST

జిల్లాలో ఆదివారం ఒక పాజిటివ్‌ కేసు నమోద యినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు

జిల్లాలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదు

కామారెడ్డి టౌన్‌, జూలై 5: జిల్లాలో ఆదివారం ఒక పాజిటివ్‌ కేసు నమోద యినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. భిక్కనూర్‌ మండలం మోటాట్‌ పల్లికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కాగా బాన్సువాడ ప్రాంతంలో మరో పాజిటివ్‌ కేసు నమోదయినట్లు సమాచా రం. ఈ విషయంపై డీఎంహెచ్‌వోను వివరణ కోరగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఆ వ్యక్తి ప్రస్తుతం హైదరా బాద్‌లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఆదివారం జిల్లా నుంచి 19 మంది రక్త నమూనాలు సేకరించామని తెలిపారు. మొత్తం పాజిటివ్‌ కేసులు 77 కాగా అందులో యాక్టివ్‌ కేసులు 54 ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2020-07-06T11:14:01+05:30 IST