ఒక్కరోజే 1,127 కేసులు
ABN , First Publish Date - 2021-05-09T05:00:08+05:30 IST
ఒక్కరోజే 1,127 కేసులు
నలుగురు మృత్యువాత
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. శనివారం ఒక్కరోజే 1,127 మందికి వైరస్ సోకింది. మరో నలుగురు మృతిచెందారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 68,718కు చేరింది. మరణాలు అధికారికంగా 809కు చేరాయి. ఇంకా 8,604 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.