Mumbaiలో నివాస భవనం కూలి ఒకరి మృతి, 16మందికి గాయాలు
ABN , First Publish Date - 2022-06-09T13:16:53+05:30 IST
మహారాష్ట్రలోని ముంబై నగరంలో భవనం కుప్పకూలిన ఘటన విషాదం నింపింది....
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో భవనం కుప్పకూలిన ఘటన విషాదం నింపింది. ముంబైలోని బాంద్రా వెస్ట్లోని శాస్త్రినగర్లో బుధవారం రాత్రి మూడంతస్తుల భవనం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో 16 మందికి గాయాలైనట్లు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. భవనం కూలి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.సహాయ చర్యలు చేపట్టామని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. భవన శిథిలాల్లో నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు బీఎంసీ అధికారులు అనుమానిస్తున్నారు.మున్సిపల్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.