కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-05-16T06:51:41+05:30 IST

కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన కార్వేటినగరం మండలం అమ్మపల్లి క్రాస్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది.

కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ప్రమాదంలో చనిపోయినా రఘు

కార్వేటినగరం, మే 15: కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన కార్వేటినగరం మండలం అమ్మపల్లి క్రాస్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ దస్తగిరి వివరాల మేరకు.. పుత్తూరు నుంచి కార్వేటినగరం మీదుగా చిత్తూరుకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు, అమ్మపల్లి క్రాస్‌ వద్ద ఎదురుగా ద్విచక్ర వాహనంలో వస్తున్న కృష్టసముద్రంకు చెందిన రఘు(36)ను ఢీకొంది. రఘుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కార్వేటినగరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దస్తగిరి తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

Updated Date - 2022-05-16T06:51:41+05:30 IST