గుంజనేటిలో ఒకరు మృతి
ABN , First Publish Date - 2021-04-24T04:46:42+05:30 IST
మండలంలోని ఈటిమాపురం సమీపంలో గల గుంజనేటిలో ప్రమాదవశాత్తు జారిపడి నాయుడువారిపల్లె దళితవాడకు చెందిన తలారి రఘురామయ్య (45) మృతి చెందాడు.
పెనగలూరు, ఏప్రిల్ 23 : మండలంలోని ఈటిమాపురం సమీపంలో గల గుంజనేటిలో ప్రమాదవశాత్తు జారిపడి నాయుడువారిపల్లె దళితవాడకు చెందిన తలారి రఘురామయ్య (45) మృతి చెందాడు. పోలీసుల కథనం మే రకు... రఘురామయ్య తన సొంత పనిపై బయటికెళ్లి రెండు రోజులుగా ఇం టికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులకు, తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి విచారించారు. ఎలాంటి ఫలితం లేదు. శుక్రవారం గుంజనేటిలో మృతదేహం తేలియాడుతోందని ఎవరో చెప్పడంతో అక్కడికెళ్లి పరిశీలించారు. అది రఘురామయ్య మృతదేహంగా గుర్తించారు. ఈ సమాచారాన్ని స్థానిక వీఆర్ఓ ద్వారా కుటుంబ సభ్యులు పెనగలూరు పోలీసులకు తెలపడంతో ఎస్ఐ చెన్నకేశవ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా రఘురామయ్యకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారని, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామప్రజలు కోరుతున్నారు.