విద్యుదాఘాతంతో ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-11-13T23:19:31+05:30 IST

జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గూడూరు

విద్యుదాఘాతంతో ఒకరు మృతి

మహబూబాబాద్: జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గూడూరు మండలంలోని రాములు తండాలో విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. అంతేకాకుండా మేతకు వెళ్లిన 10 గొర్రెలకు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామ పొలిమేరలో అమర్చిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి భూమిలోకి అమర్చిన ఎర్త్ వైర్ చుట్టూ రక్షణ కవచం లేకపోవటమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుదాఘాతంతో ఒకరు మరణించడంతో అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-11-13T23:19:31+05:30 IST