రైలు కింద పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-04-24T05:13:21+05:30 IST

బైరెడ్డిపేట గ్రామానికి చెందిన బైరెడ్డి చినఅప్పల నాయుడు(65) అనే వ్యక్తి విశాఖ జిల్లా యలమంచిలి వద్ద రైలు కింద పడి మృతిచెందారు.

రైలు కింద పడి ఒకరి మృతి

చీపురుపల్లి, ఏప్రిల్‌ 23: బైరెడ్డిపేట గ్రామానికి చెందిన బైరెడ్డి చినఅప్పల నాయుడు(65) అనే వ్యక్తి విశాఖ జిల్లా యలమంచిలి వద్ద రైలు కింద పడి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చినప్పల నాయు డు ఈనెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే మళ్లీ తిరిగి రాకపోవ డంతో, ఆయన కొడుకు స్థానిక చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తుండగానే, యల మంచిలిలో రైలు కింద పడి అప్పలనాయుడు మృతిచెందినట్టు  కుటుంబీలకు సమాచారం వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు యలమంచిలి వెళ్లారు. గురు వారం రాత్రి రైలులో నుంచి జారి పడిఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించిన అక్కడి జీఆర్పీ ఎస్‌ఐ మారూఫ్‌ చీపురుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టు చేశారు.

 


Updated Date - 2021-04-24T05:13:21+05:30 IST