రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-05-11T04:37:47+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మృతుడు గవాస్కర్‌

ముగ్గురికి గాయాలు

కొమ్మాది, మే 10: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని పాడేరుకు చెందిన  పలాసి గవాస్కర్‌ (32) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా నగరంలో నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం భీమిలిలో ఉన్న పిన్నింటికి ఆటోలో వెళుతుండగా పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం జంక్షన్‌ నుంచి డ్రైవర్‌ ఆటోను రాంగ్‌ రూట్‌లో తీసుకువెళ్లడాన్ని ప్రయాణికులు గుర్తించి నిలదీశారు. దీంతో ఆటోడ్రైవర్‌ యూటర్న్‌ తీసుకుంటుండగా కొమ్మాది వైపు నుంచి నగరంలోకి వస్తున్న లారీ.. ఆటోను ఢీకొంటుదేమోనన్న భయంతో గవాస్కర్‌ అందులోనుంచి కిందకు దిగి సర్వీస్‌ రోడ్డులోని డివైడర్‌పై నిల్చొన్నాడు. అయితే అప్పటికే అదుపు తప్పిన లారీ ఆటోతో పాటు డివైడర్‌పై ఉన్న గవాస్కర్‌ను ఢీకొనడంతో ఆయన మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ముగ్గురికి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

Updated Date - 2021-05-11T04:37:47+05:30 IST