రైలు ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-03-09T05:56:42+05:30 IST
దావాలపేట రైల్వేగేటు వద్ద రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
గజపతినగరం, మార్చి 8: దావాలపేట రైల్వేగేటు వద్ద రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. బొబ్బిలి రైల్వే హెచ్సీ ఎస్.కృష్ణారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.వెంకటాపురం గ్రామానికి చెందిన పెదిరెడ్ల సతీష్ (37) రైలు గేటు దాటుతుండగా బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళుతున్న గూడ్స్రైలు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య చిట్టమ్మ, ఇద్దరు పిల్లలు జయ, సంతోష్ ఉన్నారు. సతీష్ గతంలో లారీ క్లీనర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు విరిగిపోయింది. దీంతో దివ్యాంగుడైన సతీష్ పట్టణంలో హోటల్లో పనిచేస్తూ కుటంబ పోషణ సాగిస్తున్నాడు. అందిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామా కోసం మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.