గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-10-17T04:37:40+05:30 IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన శుక్రవారం దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

 దుబ్బాక/మిరుదొడ్డి, అక్టోబరు 16: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన సంఘటన శుక్రవారం దుబ్బాక మండలం పోతారెడ్డిపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. భూంపల్లి శిక్షణ ఎస్‌ఐ జలేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన కానుగంటి శ్రీనివాస్‌ (40) సొంత పనుల నిమిత్తం భూంపల్లి గ్రామానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లే దారిని మరిచి పోతరెడ్డిపేట వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. 


 

Updated Date - 2021-10-17T04:37:40+05:30 IST