ట్రాక్టర్ ఢీకొని ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2021-02-28T06:05:43+05:30 IST
: ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతిచెందగా ఇద్దరికి గాయాలైన సంఘటన మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం జరిగింది.
పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 27 : ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతిచెందగా ఇద్దరికి గాయాలైన సంఘటన మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ గోపాల్రావు కథనం ప్రకారం పెద్దవూర మం డలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన కోరపిడిక రామలింగయ్య(39) హైదరాబాద్లో బోరుబండి సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఆయనకు పీఏపల్లి మండల శివారులో 3.20ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొత్తగా వచ్చిన పాస్బుక్కులో భూమి తక్కువగా నమోదవడంతో ఎల్లాపురానికి చెందిన ఎలిమినేటి ప్రసాద్తో కలిసి పీఏపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. పని ముగిసిన అనంతరం ఇద్దరు కలిసి స్వగ్రామం ఉట్లపల్లికి బైక్పై బయలుదేరారు. ఎల్లాపురం పోవడానికి రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద ఉన్న వీరబోయిన లింగయ్య తెలిసిన వ్యక్తి కావడంతో రామలింగయ్య బైక్ ఆపి ఎక్కాడు. దీంతో ముగ్గురూ బైక్పై బయలుదేరారు. బైక్ స్పీడుగా నడపడంతో రంగారెడ్డిగూడెం గ్రామ శివారులో మూలమలుపు వద్ద అదుపు తప్పి ముగ్గురు కిందపడ్డారు. రోడ్డుపై పడ్డ రామలింగయ్య తలపై మేడారం నుంచి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ముందు టైర్ వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన ఇద్దరికి గాయాలయ్యాయి.
దూడను ఢీకొట్టిన బైక్ : వ్యక్తి దుర్మరణం
కనగల్, ఫిబ్రవరి 28 : దూడను మోటర్ సైకిల్ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని లింగాలగూడెం స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కురంపల్లి గ్రామానికి చెందిన బూషిగంపల చినరాజు(32) దర్వేశిపురం స్టేజీ వద్ద ఓ వైన్స్షాపులో పనిచేస్తున్నాడు. రోజువారీగా దుకాణం మూసేశాక రాత్రి 10గంటల సమయంలో బైక్పై ఇంటికి తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో లింగాలగూడెం స్టేజీవద్ద రోడ్డును దాటుతున్న గేదెదూడను వేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో చినరాజు తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం నల్లగొండకు తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. తండ్రి కృష్ణయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భార్య ఆరు నెలల గర్భిణి.
దర్వేశిపురంలో వ్యక్తిపై దాడి
కనగల్, ఫిబ్రవరి 27 : మండలంలోని దర్వేశిపురం గ్రామానికి చెందిన బుక్క రవిపై నలుగురు వ్యక్తులు శనివారం కట్టెలతో దాడి చేయగా తలకు తీవ్రగాయాలయ్యాయి. రవి ఫిర్యాదు మేరకు దాడి చేసిన పర్వతగిరి గ్రామానికి చెందిన సీహెచ్.శ్రీశైలం, జి.జయశంకర్, ఖాజీరామారానికి చెందిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
మిర్యాలగూడ, ఫిబ్రవరి 27 : పట్టణంలోని సంతో్షనగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సంతోష్నగర్ కాలనీకి చెందిన సలీం పట్టణంలో పిల్లల ఆటవస్తువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన ఆగంతకులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని పొరుగువారు బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చా రు. శుక్రవారం రాత్రి ఇంటికి చేరుకున్న సలీం కుటుంబసభ్యులు రూ.8లక్షల నగదుతో పాటు 3తు లాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి టుటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.