కరోనా నియంత్రణకు రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-05-11T07:29:07+05:30 IST
కందుకూరు నియోజకవర్గంలో అమలవుతున్న కరోనా నియంత్రణ చర్యల కోసం గుడ్లూరు మండలం దారకానిపాడు ఎంపీటీసీ సభ్యుడు జి.ప్రభాకర్ లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.
కందుకూరు, మే 10: కందుకూరు నియోజకవర్గంలో అమలవుతున్న కరోనా నియంత్రణ చర్యల కోసం గుడ్లూరు మండలం దారకానిపాడు ఎంపీటీసీ సభ్యుడు జి.ప్రభాకర్ లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డిని కలిసి ఈ మొత్తాన్ని అందజేశారు. ఏరియా హాస్పటల్లో ఆక్సిజన్ కాన్సన్ర్టేటర్స్ ఏర్పాటు కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపిన ఎమ్మెల్యే మహీధర రెడ్డి ప్రభాకర్ని ప్రత్యేకంగా అభినందించారు.