రూ.1.43 లక్షల నగదు స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-17T06:01:32+05:30 IST

సత్యవేడు పోలీసుల తనిఖీల్లో రూ.1.43 లక్షల నగదు, ఎన్నికల సామగ్రి పట్టుబడింది.

రూ.1.43 లక్షల నగదు స్వాధీనం

సత్యవేడు, ఏప్రిల్‌ 16: పోలీసుల తనిఖీల్లో రూ.1.43 లక్షల నగదు, ఎన్నికల సామగ్రి పట్టుబడింది. ఎస్‌ఐ నాగార్జునరెడ్డి వివరాల మేరకు.. సత్యవేడు పట్టణంలోని పలు లాడ్జిల్లో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన టీడీపీ కార్యకర్త నరసింహులు వద్ద రూ.1.43 లక్షలున్నట్లు గుర్తించి ఆరా తీశారు. దీనికి సంబంధించి బిల్లులు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు గదిలో ఉన్న పార్టీ జెండాలు, టోపీలనూ స్వాధీనం చేసుకుని ఆయన్ను అరెస్టు చేశారు. కాగా, నరసింహులు వెంట వచ్చిన మరోవ్యక్తి శ్రీధర్‌ పరారైనట్లు ఎస్‌ఐ వివరించారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-17T06:01:32+05:30 IST