1.20 లక్షల పరీక్షలు.. 647 కేసులు
ABN , First Publish Date - 2021-07-25T08:28:27+05:30 IST
రాష్ట్రంలో శనివారం 1,20,213 మందికి టెస్టులు చేయగా.. 647 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్సతో మరో ఇద్దరు మృతిచెందారు...
- రాష్ట్రంలో కరోనాతో మరో ఇద్దరి మృతి
- 1.30 లక్షల మందికి రెండో డోసు టీకా
హైదరాబాద్, జూలై 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం 1,20,213 మందికి టెస్టులు చేయగా.. 647 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్సతో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 6,40,659కు, మరణాలు 3,780కు పెరిగాయి. కొత్తగా 749 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాక 6.27 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా 9,625 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీలోనే 81 నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 3,844 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆక్సిజన్పై 1,669, ఐసీయూపై 1,360 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో రెండో డోసు టీకా 1,30,333 మందికి వేశారు.
ఏపీలో కొత్తగా 2,174 కేసులు.. 18 మరణాలు
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,820 శాంపిల్స్ను పరీక్షించగా 2,174 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని, కరోనాతో మరో 18 మంది చనిపోయారని వైద్యఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 19,52,513కి, కరోనా మృతుల సంఖ్య 13,241కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 2,737 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 19,16,914కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,358 యాక్టివ్ కేసులున్నాయి.