నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,11,116 విరాళం

ABN , First Publish Date - 2022-01-22T06:21:46+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన టి.బాలకృష్ణ, మాణిక్యలక్ష్మి దంపతులు రూ.1,11,116 నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం అందజేశారు.

నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,11,116 విరాళం

ఆత్రేయపురం, జనవరి 21: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన టి.బాలకృష్ణ, మాణిక్యలక్ష్మి దంపతులు రూ.1,11,116 నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం అందజేశారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు దాతలకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. శుక్రవారం వివిధ ప్రాంతాలనుంచి భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదాయం రూ.51,858 లభించినట్టు ఈవో తెలిపారు. 



Updated Date - 2022-01-22T06:21:46+05:30 IST