రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
ABN , First Publish Date - 2021-04-17T06:00:54+05:30 IST
మండల పరిధిలోని బొల్లాపల్లి రోడ్డు వద్ద జాతీయరహదారిపై గుంటూరు నుంచి ఒంగోలు వెళుతున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్ర మాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ముగ్గు రు మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారంరాత్రి జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న నున్న రామాంజనేయులు, నాగరత్నంలను హైవే అంబులెన్స్లో.. నున్న కన్యాకుమారి, నిమ్మల జయలక్ష్మిలను 108వాహనం లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. మార్గమధ్యలో రామాంజనేయులు(45)) మృతి చెం దాడు. ఆటోను నడుపుతున్న నిమ్మల రామకృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
ఆటోను వెనుక నుంచి ఢీకొన్న కారు
ముగ్గురు మహిళలకు గాయాలు
బాధితులు ఒంగోలువాసులు
మార్టూరు, ఏప్రిల్ 16 : మండల పరిధిలోని బొల్లాపల్లి రోడ్డు వద్ద జాతీయరహదారిపై గుంటూరు నుంచి ఒంగోలు వెళుతున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్ర మాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ముగ్గు రు మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారంరాత్రి జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న నున్న రామాంజనేయులు, నాగరత్నంలను హైవే అంబులెన్స్లో.. నున్న కన్యాకుమారి, నిమ్మల జయలక్ష్మిలను 108వాహనం లో ఒంగోలు రిమ్స్కు తరలించారు. మార్గమధ్యలో రామాంజనేయులు(45)) మృతి చెం దాడు. ఆటోను నడుపుతున్న నిమ్మల రామకృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆటో లో ప్రయాణిస్తున్న వారు ఒంగోలుకు చెంది న వారు. కన్యాకుమారి ఒంగోలులో గాంధీబొ మ్మసెంటరుకు, జయలక్ష్మి కొణిజేడు బస్టాండ్కు చెందిన వారు. వారంతా గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఒక కార్యక్రమానికి వెళ్లి మళ్లీ ఒంగోలు వెళ్తున్నారు. వారి ఆ టోను కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ము గ్గురు వ్యక్తులు కారులో సంతనూతలపాడు వెళుతూ వెనుక నుంచి ఢీకొన్నారు. ఆటో రో డ్డుపై పల్టీలు కొడుతూ బోల్తాపడింది. కారు లో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవ రు పి.ప్రణవ్చంద్తో పాటు మరో ఇద్దరు వ్య క్తులు క్షేమంగా బయటపడ్డారు. సంఘటనా స్థలానికి ఏఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో వచ్చి బాఽధితులను ఒంగోలు ఆసుపత్రికి పం పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.