యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-28T04:03:21+05:30 IST

బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఓ యువకుడు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం తెల్లవారుజామున జరిగింది.

యువకుడి ఆత్మహత్య

నెల్లూరు(క్రైం) : ఫిబ్రవరి 27: బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఓ యువకుడు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం తెల్లవారుజామున జరిగింది.  పోలీసుల సమాచారం మేరకు జడ్పీ కాలనీకి చెందిన  ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు వెంకట నరేష్‌యాదవ్‌ (24) బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. రోజూలానే శుక్రవారం రాత్రి నరేష్‌ తన గదిలో నిద్రపోయాడు. శనివారం ఉదయం 10 గంటలు అవుతున్నా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీలో నుంచి చూడగా నరేష్‌ ఫ్యానుకు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే తలుపులు పగలగొట్టి నరేష్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు దర్గామిట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ విజయకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను ఆరాతీశారు. ఎలాంటి సమస్యలూ లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు. మృతదేహాన్ని  ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-02-28T04:03:21+05:30 IST