రైలు కిందపడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-07T04:09:42+05:30 IST
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందాడు. సౌత్రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే ట్రాక్పై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
నెల్లూరు(క్రైం) : మే 6: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందాడు. సౌత్రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై వైపు వెళ్లే ట్రాక్పై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి రైల్వే హెడ్కానిస్టేబుల్ ప్రభాకర్రావు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడికి 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. మృతుడు తెలుపురంగు చొక్కా, నలుపురంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే హెడ్కానిస్టేబుల్ కేసు నమెదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.