ఎద్దుల పరుగు పందెంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-08-14T06:02:44+05:30 IST
మండలంలోని బండపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ఎద్దుల పరుగుపందెం(కుంచులు)లో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలపాలయ్యారు.
గుడిపాల, ఆగస్టు 13: మండలంలోని బండపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ఎద్దుల పరుగుపందెం(కుంచులు)లో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలపాలయ్యారు. బండపల్లిలో ఉదయం ఎద్దుల పరుగుపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న ముట్టుకూరుపల్లె గ్రామస్తుడు వెంకటేష్ యాదవ్ అక్కడికి చేరుకున్నారు. ఎద్దుమీద చెయ్యి వేయబోగా కొమ్ములతో బలంగా పొడిచింది. ఈ ఘటనలో వెంకటేష్ యాదవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన వినోద్కుమార్ గాయాల పాలయ్యాడు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి, వెస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు రాజశేఖర్, ప్రసాద్ అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. అనుమతి లేకుండా ఎద్దుల పరుగుపందేలు నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కేసులు నమోదు చేశారు.