మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-07T04:08:30+05:30 IST

భార్య మద్యం తాగొద్దని వారించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నవాబుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
మృతుడు శ్రీనివాసులు

నెల్లూరు(క్రైం)  మే 6: భార్య మద్యం తాగొద్దని వారించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నవాబుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరులోని రామచంద్రాపురం ప్రాంతంలో శ్రీనివాసులు (30), కల్యాణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం వివాహమైన వారికి తొమ్మిదినెలల బాబు ఉన్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. దాంతో భార్యాభర్తల  మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 5న శ్రీనివాసులు మద్యం  తాగుతుండగా భార్య భోజనానాకి రమ్మని పిలిచింది. అతను రాకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుసుకుంది. మద్యం తాగద్దని భర్తకు గట్టిగా చెప్పింది. కోపంతో శ్రీనివాసులు భార్యను కొట్టడంతో ఆమె బయటకు కేకలు పెడుతూ వెళ్లిపోయింది. అనంతరం మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కల్యాణి  బుధవారం రాత్రి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Updated Date - 2021-05-07T04:08:30+05:30 IST