లక్ష్మీ నగర్ తండాలో ఒకరి హత్య
ABN , First Publish Date - 2022-07-06T05:35:57+05:30 IST
డబ్బుల విషయంలో చెలరేగిన చిన్న పాటిగొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఎస్ఐ ఆనంద్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం భిక్కనూర్ మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన బాదవత్ జీవన్ (45) అదే గ్రామానికి చెందిన సమీప బంధువు వినోద్ వద్ద రూ.30 వేలు అప్పుచేశాడు.
భిక్కనూర్,జూలై 5: డబ్బుల విషయంలో చెలరేగిన చిన్న పాటిగొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఎస్ఐ ఆనంద్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం భిక్కనూర్ మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన బాదవత్ జీవన్ (45) అదే గ్రామానికి చెందిన సమీప బంధువు వినోద్ వద్ద రూ.30 వేలు అప్పుచేశాడు. ఈ విషయమై గొడవ జరగగా జీవన్ తనభార్య లక్ష్మి కాళ్లపట్టీలు, పుస్తెల తాడు తాకట్టు పెట్టడానికి కామారెడ్డికి వినోద్ను తీసుకుని వెళ్లి గ్రామానికి వచ్చే సమయంలో ఇరువురుగొడవ పడి ఇంటికి చేరుకున్నారు. దీంతో జీవన్ను తనభార్య మళ్లీ ఎందుకు గొడవపడుతున్నారని అడుగుతుండగా వినోద్, అదేగ్రామానికి చెందిన ఏమ్లా ఆకస్మాతుగా జీవన్పై దాడిచేశారు. బండరాయితో ముఖంపై కొట్టారు. దీంతో గాయపడ్డ జీవన్ తీవ్ర రక్తస్రావమై స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే జీవన్ భార్యలక్ష్మి గ్రామస్థుల సహాయంతో 108 వాహణంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి రిఫర్చేశారు. దీంతో వెంటనే నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో జీవన్ మృతిచెందాడని ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని మృతదేహన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.