కొద్దిగా శాంతించిన కరోనా

ABN , First Publish Date - 2020-09-23T09:34:00+05:30 IST

కరోనా కొద్దిగా శాంతించింది. రెండు రోజులుగా పాజిటివ్‌ల సంఖ్య తగ్గింది. సోమవారం 409 కేసులు వెలుగు చూడగా, మంగళవారం 387 నమోదయ్యాయి. అందులో ఒంగోలులో అత్యధికంగా 108 ఉన్నాయి. అద్దంకిలో 40, చీరాలలో 24,

కొద్దిగా శాంతించిన కరోనా

మరో 387 కేసులు నమోదు

78 మంది డిశ్చార్జి, ముగ్గురి మృతి


ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 22 :

కరోనా కొద్దిగా శాంతించింది. రెండు రోజులుగా పాజిటివ్‌ల సంఖ్య తగ్గింది. సోమవారం 409 కేసులు వెలుగు చూడగా, మంగళవారం 387 నమోదయ్యాయి. అందులో ఒంగోలులో అత్యధికంగా 108 ఉన్నాయి. అద్దంకిలో 40, చీరాలలో 24, కందుకూరులో 10 చీమకుర్తిలో 8 కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1514 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.


వారిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 721, కిమ్స్‌లో 72, సంఘమిత్రలో 75, నల్లూరి నర్సింగ్‌ హోంలో 38, వెంకటరమణలో 26, ప్రకాశం ఆసుపత్రిలో 25 మంది ఉన్నారు. 54 మంది హోంక్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. 78 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ముగ్గురు మృతి చెందారు.  

Updated Date - 2020-09-23T09:34:00+05:30 IST