వడ్డీ వ్యాపారి దాష్టీకం

ABN , First Publish Date - 2020-09-23T09:40:46+05:30 IST

చీరాల టౌన్‌, సెప్టెంబరు 22 : తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదని వడ్డీ వ్యాపారి ఓ మహిళపై దాష్టీకం ప్రదర్శించాడు. దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఏకంగా ఆమె ఇంటికి తాళాలు వేశాడు

వడ్డీ వ్యాపారి దాష్టీకం

అప్పు తీర్చలేదని అర్ధరాత్రి ఇంటికి తాళాలు 

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు


చీరాల టౌన్‌, సెప్టెంబరు 22 : తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించలేదని వడ్డీ వ్యాపారి ఓ మహిళపై దాష్టీకం ప్రదర్శించాడు. దిక్కున్న చోట చెప్పుకోమంటూ ఏకంగా ఆమె ఇంటికి తాళాలు వేశాడు. ఈ సంఘటన చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ ఆంధ్రకేసరినగర్‌లో జరిగింది. బాధితురా లు మూకిరి నయోమి కథనం ప్ర కారం.. ఆమె భర్తకు రెండునెలల క్రితం అనారోగ్య సమస్య వచ్చింది.


చికిత్సకు డబ్బు లేకపోవడంతో గుంటూరు జిల్లా స్టువర్టుపురానికి చెందిన సురేష్‌ వద్ద రూ. 70వేలు అప్పుగా తీసుకుంది. అందుకు సంబంధించి ఇప్పటికే రూ. 80వేలు చెల్లించింది. ఇంకా రూ. లక్ష చెల్లించాలంటూ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో సురేష్‌ ఆంధ్రకేసరినగర్‌లోని నయోమి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశాడు. బాధితురాలు పెద్దల సమక్షంలో అప్పటికప్పుడే మరో రూ.50వేలు చెల్లించేందుకు సిద్ధపడింది.


అయినా ఆ వడ్డీ వ్యాపారి కనికరించకుండా ఆ మహిళను, మనవళ్లను జుట్టు పట్టుకుని బయటకు తోసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీ లేక రాత్రంతా కుటుంబమంతా ఇంటి బయట కూర్చుని మంగళవారం ఉదయాన్నే ఈపూరుపాలెం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2020-09-23T09:40:46+05:30 IST