రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2020-10-27T07:09:58+05:30 IST
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. మండలంలోని లంకోజనపల్లిలో ఆయన ఆదివారం సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
దర్శి, అక్టోబరు 26 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. మండలంలోని లంకోజనపల్లిలో ఆయన ఆదివారం సజ్జల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. కార్యక్రమంలో దర్శి, తూర్పువెంకటాపురం చైర్పర్సన్లు చెన్నారెడ్డి, ఎం.పుల్లారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మెన్ కేవీ.రెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వైసీపీ నాయకులు కే.అంజిరెడ్డి, ఎస్.తిరుపతిరెడ్డి, వైవీ సుబ్బయ్య, రవిచంద్రారెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, గోపు యర్రయ్య, కోటయ్య పాల్గొన్నారు.