వరద బాధితుల కోసం తరలిన సరుకుల వాహనం

ABN , First Publish Date - 2020-10-27T07:13:25+05:30 IST

వర దలతో సర్వం కోల్పోయిన హైదరా బాద్‌ వాసులను ఆదుకునేందుకు హ్యూమన్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ సభ్యులు దాతల నుంచి సేకరించిన బి య్యం, నిత్యావసరాల సరుకుల వాహనాన్ని సీఐ కొండవీటి శ్రీనివాసరావు సోమవారం ప్రారం భించారు.

వరద బాధితుల కోసం తరలిన సరుకుల వాహనం

పామూరు, అక్టోబరు 26 : వర దలతో సర్వం కోల్పోయిన హైదరా బాద్‌ వాసులను ఆదుకునేందుకు హ్యూమన్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ సభ్యులు దాతల నుంచి సేకరించిన బి య్యం, నిత్యావసరాల సరుకుల వాహనాన్ని సీఐ కొండవీటి శ్రీనివాసరావు సోమవారం ప్రారం భించారు.  ఈ సందర్భంగా పామూరు పోలీసు ల తరపున 10 టిక్కీల బియ్యం, 10 దుప్పట్లను తమ వంతుగా సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ అం బటి చంద్రశేఖర్‌ యాదవ్‌ హెచ్‌డబ్యూల్యసీ స భ్యులకు అందజేశారు. దాతల నుంచి సుమారు 100 బియ్యం బస్తాలు, దుప్పట్లు, నిత్యావసర స రుకులు సేకరించామని, బాధిత కుటుంబానికి 10 కేజీల బియ్యం వంతున పంపిణీ చేస్తామని సంస్థ అధ్యక్షుడు మౌలానా హుస్సేని తెలిపారు.  


వరద బాధితులకు బియ్యం టిక్కీలు అందజేత 

వరద బాధితుల కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అభిమాని స య్యద్‌ అమీర్‌బాబు 10 బియ్యం టిక్కీలను సమకూర్చగా, టీడీపీ నాయకులు ఎం.గంగరాజు యాదవ్‌, షేక్‌ గౌస్‌బాషా, ఖాజా రహంతుల్లా ఆ  సంస్థ సభ్యులకు సోమవారం అందజేశారు. 

Updated Date - 2020-10-27T07:13:25+05:30 IST