వరద బాధితుల కోసం తరలిన సరుకుల వాహనం
ABN , First Publish Date - 2020-10-27T07:13:25+05:30 IST
వర దలతో సర్వం కోల్పోయిన హైదరా బాద్ వాసులను ఆదుకునేందుకు హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు దాతల నుంచి సేకరించిన బి య్యం, నిత్యావసరాల సరుకుల వాహనాన్ని సీఐ కొండవీటి శ్రీనివాసరావు సోమవారం ప్రారం భించారు.
పామూరు, అక్టోబరు 26 : వర దలతో సర్వం కోల్పోయిన హైదరా బాద్ వాసులను ఆదుకునేందుకు హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు దాతల నుంచి సేకరించిన బి య్యం, నిత్యావసరాల సరుకుల వాహనాన్ని సీఐ కొండవీటి శ్రీనివాసరావు సోమవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా పామూరు పోలీసు ల తరపున 10 టిక్కీల బియ్యం, 10 దుప్పట్లను తమ వంతుగా సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అం బటి చంద్రశేఖర్ యాదవ్ హెచ్డబ్యూల్యసీ స భ్యులకు అందజేశారు. దాతల నుంచి సుమారు 100 బియ్యం బస్తాలు, దుప్పట్లు, నిత్యావసర స రుకులు సేకరించామని, బాధిత కుటుంబానికి 10 కేజీల బియ్యం వంతున పంపిణీ చేస్తామని సంస్థ అధ్యక్షుడు మౌలానా హుస్సేని తెలిపారు.
వరద బాధితులకు బియ్యం టిక్కీలు అందజేత
వరద బాధితుల కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అభిమాని స య్యద్ అమీర్బాబు 10 బియ్యం టిక్కీలను సమకూర్చగా, టీడీపీ నాయకులు ఎం.గంగరాజు యాదవ్, షేక్ గౌస్బాషా, ఖాజా రహంతుల్లా ఆ సంస్థ సభ్యులకు సోమవారం అందజేశారు.