కారు బోల్తాపడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-10-28T09:57:17+05:30 IST

కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయలయ్యాయి.

కారు బోల్తాపడి ఒకరి మృతి

కొనకనమిట్ల, అక్టోబరు 27: కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నమనగుండం గ్రామ సమీపంలో మంగళవారం జరి గింది. పోలీసుల కథనం ప్రకారం.. బేస్తవారపేట మండలం వంగపా డు గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి విత్తనపు గొర్రు కొనుగోలు చేసేందుకు పొదిలికి కారులో బయల్దేరారు. నమనగుండం సమీ పంలోకి రాగానే రోడ్డుపై ఉన్న గోతుల్లో పడిన కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. డోర్‌లాక్‌ తెరుచు కోవడంతో వెంకటరెడ్డి కారులో నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డికి గాయాలయ్యాయి. మృతుడు వెంకటరెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. ఏఎస్‌ఐ నాయక్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. 


Updated Date - 2020-10-28T09:57:17+05:30 IST