దేశవ్యాప్తంగా ఓఎన్‌జీసీ సేవలు

ABN , First Publish Date - 2021-10-27T05:02:01+05:30 IST

దేశంలోనే 24 బ్రాంచ్‌ల ద్వారా ఓఎన్‌జీసీ సామాజిక సేవా కార్యక్ర మాలు చేపడుతున్నట్టు సంస్థ ఈడీ అమిత్‌ నారాయణ్‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా ఓఎన్‌జీసీ సేవలు
మాట్లాడుతున్న ఈడీ అమిత్‌ నారాయణ్‌

ఈడీ అమిత్‌ నారాయణ్‌



 నరసాపురం టౌన్‌, అక్టోబరు 26 : దేశంలోనే 24 బ్రాంచ్‌ల ద్వారా ఓఎన్‌జీసీ సామాజిక సేవా కార్యక్ర మాలు చేపడుతున్నట్టు సంస్థ ఈడీ అమిత్‌ నారాయణ్‌ తెలిపారు. పట్టణంలోని చలవపేటలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.  నరసాపు రంలో  ఓఎన్‌జీసీ సంస్థ ఏర్పడినప్పటి నుంచి విద్య, ఆరోగ్య , ఉపాఽధికి పెద్ద పీట వేసిందన్నారు.  దానిలో భాగంగా దళితవాడల్లో మెడికల్‌ క్యాంపులు, మహిళలు  ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ రంగాల్లో శిక్షణ, నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌పై శిక్షణ  వంటివి చేపడు తున్నామన్నారు.అనంతరం కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్లు, డ్రైవింగ్‌ శిక్షణ శిబిరాలను ప్రారం భించారు. కార్యక్రమంలో అనుదా నారాయణ్‌, అంబటి సత్యనారాయణ, పి.జగన్నాఽథరావు, మాజీ మంత్రి కొత్త పల్లి సుబ్బారాయుడు, చైర్‌పర్సన్‌ వెంకటరమణ, దొం డపాటి స్వామి, బత్తుల దుర్గారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:02:01+05:30 IST