కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
ABN , First Publish Date - 2020-10-12T09:40:15+05:30 IST
తెలంగాణ విశ్వవిద్యాల యం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఏ, బీఏ (ఎల్), చివరి
డిచ్పల్లి, ఆక్టోబరు 11: తెలంగాణ విశ్వవిద్యాల యం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలోని డిగ్రీ కోర్సులకు చెందిన బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఏ, బీఏ (ఎల్), చివరి ఆరో సెమిస్టర్ పరీక్షలు ఆదివారం ప్ర శాంతంగా జరిగాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 నుంచి 12గంటల వరకు జరిగిన చివరి ఆరో సెమిస్టర్ రెగ్యూ లర్ పరీక్షలకు మొత్తం 6864మంది విద్యార్థులకు గాను 6329 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మ ధ్యాహ్నం 2నుంచి 4గంటల వరకు జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు మొత్తం 1122 మందికి 1039 విద్యార్థులు హాజర య్యరని 83మంది గైర్హాజార య్యరని నాగరాజు తెలిపారు. ఈ పరీక్షల్లో, ఉదయం ఇద్దరు, మఽధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ డిబార్ అయ్యారన్నారు.