కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-24T05:12:04+05:30 IST

కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే

కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే

బషీరాబాద్‌/నవాబుపేట, జనవరి 23: బషీరాబాద్‌, నవాల్గ పీహెచ్‌సీల పరిధిలోని వివిధ గ్రామాల్లో 36 బృందాలు పర్వటించాయి. ఈ సందర్భంగా 1549 గృహాల్లో వైద్యసిబ్బంది సర్వే చేశారు. 47 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి 28 మందికి కిట్లను అందజేశారు. గ్రామాల్లో సర్వే తీరు, సరళిని ఎప్పటికప్పుడు బషీరాబాద్‌ ఎంపీడీవో రమేష్‌ అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, నవాబుపేట మండలంలోని ఆయా గ్రామాల్లో 1058 ఇండ్లను సర్వేచేయగా 50 మందికి జ్వర లక్షణాలు గుర్తించి 50మందికి హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేసినట్లు వైద్య బృందం తెలిపింది. నవాబుపేట మండలంలోని ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నవాబుపేటలో ఒకరికి, పూలపల్లికి చెందిన ఒకరికి కరోనా సోకిందని వైద్యులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-24T05:12:04+05:30 IST