సాగర్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-23T06:52:25+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి మంగళవారం కూడా వరద ప్రవాహం కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,52,083 క్యూసెక్కుల నీరు సాగర్‌కు

సాగర్‌కు కొనసాగుతున్న వరద

14 గేట్ల నుంచి నీటి విడుదల


నాగార్జునసాగర్‌, చింతలపాలెం, కేతేపల్లి, డిండి, శాలిగౌరారం, సెప్టెంబరు 22: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి మంగళవారం కూడా వరద ప్రవాహం కొనసాగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,52,083 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తుండగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు(312.0405 టీఎంసీలు)గాను, 589.40 అడుగులకు (310.2522 టీఎంసీలు) చేరింది. ప్రాజెక్టు 14 గేట్లు, రాత్రికి వరద పెరగడంతో 16 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8604 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 4746, ఎస్‌ఎల్‌బీసీకి 1800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 28,988, ప్రాజెక్టు 16 క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 2,38,624, మొత్తం 2,82,762 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సాగర్‌ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.


ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు(45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుత్తం 174.01 (44.23టీఎంసీలు) అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,65,309 క్యూసెక్కుల నీరు వస్తుండగా, పది క్రస్ట్‌గేట్లు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా మొత్తం 2,79,559 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 645అడుగుల సామర్థ్యం ఉన్న మూసీ ప్రాజెక్టు 643.70అడుగులకు చేరింది. ఎగువ నుంచి 5380క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు మూడు క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు 3940క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డిండి రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొంత తగ్గింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగుల(2.4 టీఎంసీలు)కు చేరగా, ఎగువ నుంచి 1000 కూసెక్కుల నీరు వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 21 అడుగుల వద్ద నిలకడగా ఉండగా, కుడి, ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2020-09-23T06:52:25+05:30 IST