ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-10-21T06:50:06+05:30 IST
శ్రీరామసాగర్ ప్రాజె క్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతోం ది. మంగళవారం రాత్రి వరకు ఎగువ ప్రాంతాల నుంచి 62,827 క్యూ సెక్కుల వరద రాగా..
మెండోర, అక్టోబరు 20: శ్రీరామసాగర్ ప్రాజె క్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతోం ది. మంగళవారం రాత్రి వరకు ఎగువ ప్రాంతాల నుంచి 62,827 క్యూ సెక్కుల వరద రాగా.. 16 గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు. అలాగే ప్రాజెక్టు నుంచి ఐదు ఎస్కేప్ గేట్ల ద్వారా 5,500 క్యూసెక్కులు నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నామన్నారు. అదే విధంగా కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, సరస్వతీ కాలువ ద్వారా 500క్యూసెక్కులు, లక్ష్మీకాలువ ద్వారా 150 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ పథకానికి 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఈఈ తెలిపారు.