తెలంగాణలో కొనసాగుతోన్న ఇంటింటి ఫీవర్ సర్వే
ABN , First Publish Date - 2022-01-23T15:06:19+05:30 IST
తెలంగాణలో కొనసాగుతోన్న ఇంటింటి ఫీవర్ సర్వే
హైదరాబాద్: తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.28 లక్షల మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్స్ అందజేసినట్లు అధికారులు తెలిపారు. సర్వేలో చిన్నారులు, పెద్దవారి వివరాలు విడివిడిగా సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్ర కరోనా లక్షణాలుంటే ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది వివరించారు.