మూసాపేటలో కొనసాగుతున్న లాక్ డౌన్
ABN , First Publish Date - 2021-05-10T05:02:18+05:30 IST
మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో మండల కేంద్రమైన మూసాపేటలో స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహిస్తు న్నారు.
మూసాపేట, మే 9 : మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో మండల కేంద్రమైన మూసాపేటలో స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహిస్తు న్నారు. 10 రోజుల నుంచి ఉదయం 11 గంటల నుంచి తెల్లావారు జాము 5గం టల వరకు గ్రామంలో వివిధ షాపుల యజమానులు మూసి వేసి ఇళ్లకే పరిమితమవుతున్నా రు. ఇదిలా ఉండగా నిజాలాపూ ర్ గ్రామంలో మూడు రోజుల నుంచి గ్రామంలో లాక్డౌన్ చేప ట్టారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల ప్రజలభద్రత కోసం ఇళ్లకే పరిమితం కావడం మంచి దని పదే పదే చెబుతుండడంతో మండలంలో ఉదయం 11 గంటల నుంచి పూర్తి స్థాయిలో ఇళ్లకే పరిమితమవుతున్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో లాక్ డౌన్ నిర్వహిస్తే కరోనా కట్టడి అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.