నిర్మల్లో కొనసాగుతున్న రాత్రి కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-04-23T05:50:26+05:30 IST
జిల్లా కేంద్రంలో రాత్రి కర్ఫ్యూను గురువారం పట్టణ పోలీసులు అమలు చేశారు.
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 22 : జిల్లా కేంద్రంలో రాత్రి కర్ఫ్యూను గురువారం పట్టణ పోలీసులు అమలు చేశారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానకూడళ్లు మంచిర్యాల్ చౌరస్తా, అంబేద్కర్ చౌక్, కలెక్టరేట్, ఈద్గాం తదితర ప్రాంతాల్లో పోలీసులు వాహనాలు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకున్నారు. కర్ఫ్యూకు సహ కరించాలని ప్రజలను కోరారు. మాస్క్లు ధరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలో తప్ప బయట తిరగరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చ ర్యలు తప్పవని అన్నారు.