కొనసాగుతున్న రామ మందిరం నిధి సేకరణ
ABN , First Publish Date - 2021-01-22T04:00:47+05:30 IST
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని వాడ వాడలో రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధిసేకరణ గురువారం రెండో రోజు కొనసాగింది.
నారాయణపేట, జనవరి 21 : అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని వాడ వాడలో రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధిసేకరణ గురువారం రెండో రోజు కొనసాగింది. పట్టణంలోని 10, 13, 14, 18, 14 వార్డులలో ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు ఇంటింటికి తిరిగి నిధిసేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ప్రభాకర్ వర్దన్, రాధాకృష్ణ, నరసింహ, పాండు, ఆకుల బాలప్ప, గోపాల్ యాదవ్, వెంకటప్ప, దత్తు, నరసింహ, తాయప్ప, అంజి, నగేష్, కృష్ణ ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.
ధన్వాడ : రామాలయ నిర్మాణం కోసం గురువారం ధన్వాడలో నిధులు సేకర ణ చేశారు. మీ సేవ నిర్వాహకులు ఎన్ఎన్ నాయుడు ఆధ్వర్యంలో పది వేల చెక్కును అందించారు. పాతపల్లి, కంసాన్పల్లి, కిష్టాపూర్, కొండాపూర్లో నిధుల ను సేకరించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.