కొనసాగుతున్న నీటి విడుదల
ABN , First Publish Date - 2020-08-04T10:30:51+05:30 IST
మండలంలోని లోయర్ మానేర్ రిజర్వాయర్ నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.
తిమ్మాపూర్, ఆగస్టు 03 : మండలంలోని లోయర్ మానేర్ రిజర్వాయర్ నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కెనల్ ద్వారా ప్రస్తుతం 5000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీ పూర్తి స్థాయి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.952 టీఎంసీల నీరు నిల్వ ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో వర్షం నీటితో పాటు ఎస్సారెస్పీ కాలువల ద్వారా మొత్తం 1,538 క్యూసెక్కుల నీరు ఎల్ఎండిలోకి వచ్చి చేరుతోందని ఆధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఎల్ఎండీలో 3.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది.