మహానాడుకు కొనసాగుతున్న YCP అడ్డంకులు

ABN , First Publish Date - 2022-05-28T15:04:09+05:30 IST

టీడీపీ మహానాడుకు వైసీపీ అడ్డంకులు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఒంగోలులో మహానాడు బహిరంగ సభ జరుగనుంది.

మహానాడుకు కొనసాగుతున్న YCP అడ్డంకులు

ప్రకాశం: టీడీపీ మహానాడు(TDP mahanadu)కు వైసీపీ(YCP) అడ్డంకులు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఒంగోలులో మహానాడు బహిరంగ సభ జరుగనుంది. అయితే మహానాడుకు మహిళలు వెళ్ళకుండా వైసీపీ కట్టడి చేస్తోంది. ఋతుస్రావం దినోత్సవం పేరుతో ఒంగోలు ఇవాళ పలు చోట్ల మహిళలతో సమావేశాలు నిర్వహించారు. డ్వాక్రా మహిళలను మీటింగ్‌కు తీసుకురావాలని ఆర్పీలకు ఆదేశాలు జారీ చేశారు. మీటింగ్‌కు రాని వారికి రుణాలు, పింఛన్లు, అమ్మ ఒడి ఆపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. కాగా... ప్రకాశం జిల్లాలో తప్ప ఇతర జిల్లాల్లో ఋతు స్రావ దినోత్సవ సమావేశాలు కనిపించని పరిస్థితి. దీంతో వైసీపీ నేతల తీరుపట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-28T15:04:09+05:30 IST