అవినాశ్‎రెడ్డికి సంబంధం లేదు... న్యాయ విచారణ అవసరం: బాలినేని

ABN , First Publish Date - 2022-03-04T00:04:38+05:30 IST

రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. నాలుగు ఏళ్లలో ...

అవినాశ్‎రెడ్డికి సంబంధం లేదు... న్యాయ విచారణ అవసరం: బాలినేని

ప్రకాశం: రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి సీఎం జగన్  నిర్ణయం తీసుకుంటారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నాలుగు ఏళ్లలో టీడీపీ చేయలేని పనులు మూడు నెలల్లో ఎలా చేయాలో ఒక్కసారి ఆలోచించాలన్నారు. వివేకా హత్య కేసు విచారణలో మ్యానిప్లేషన్ జరుగుతుందని మంత్రి అనుమనం వ్యక్తం చేశారు. 


‘‘హత్య కేసులో న్యాయంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వివేకా హత్య కేసుతో అవినాశ్‌రెడ్డికి సంబంధం లేదు. రాబోయే ఎన్నికల్లో 160 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. ఎవరికి ఓట్లు వేయాలో ప్రజలకు తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలోకి అడుగు పెట్టనని చెప్పాడు. చంద్రబాబు జీవితంలో అసెంబ్లీలోకి రాలేడని ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం.’’ అని మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-03-04T00:04:38+05:30 IST