అర్హతలో అంతంతే..
ABN , First Publish Date - 2022-07-02T06:32:23+05:30 IST
అర్హతలో అంతంతే..
ఖమ్మం ఖానాపురం హవేలి, జూలై 1 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉమ్మడి జిల్లా అభ్యర్థుల ఉత్తీర్ణత అంతంతమాత్రంగానే ఉంది. శుక్రవారం ఫలితాలు విడుదలవగా.. ఖమ్మం జిల్లా నుంచి పేపర్ 1 (యస్జీటీ)కు 18,514 మంది ధరఖాస్తు చేసుకోగా 16,517 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 6,119 మంది మాత్రమే అర్హత సాధించగా.. 37.05 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పేపర్-2 (స్కూల్ అసిస్టెంట్)కు 15,004 మంది ఽధరఖాస్తు చేసుకొని 13,637 మంది పరీక్ష రాశారు. 7,603 మంది అర్హత సాధించగా.. 55.75శాతం ఉత్తీర్ణత వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి పేపర్-1కు 9,509 మంది ధరఖాస్తు చేసుకొని 8,915 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 33.30శాతం అంటే 2969 మంది అర్హత పొందరు. పేపర్-2కు 7,238 మంది ధరఖాస్తు చేసుకొని 6,786 మంది హాజరయ్యారు. వీరిలో 3867 మంది అర్హత సాధించగా.. 56.98 శాతం ఉత్తీర్ణత సాధించారు.