నాణ్యత గల ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలి
ABN , First Publish Date - 2021-04-24T04:33:42+05:30 IST
జిల్లాలోని రైతులు నాణ్యత గల వరిధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు.
ఫ అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 23: జిల్లాలోని రైతులు నాణ్యత గల వరిధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామం, హాజీపూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సహకార సంఘ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగికి సంబంధించిన వరిధాన్యాన్ని కనీస మద్ధతు ధర పొందేందుకు సంబంధిత రైతులు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్కుమార్, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.