AP: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఉమెన్ చాందీ భేటీ నేడు

ABN , First Publish Date - 2021-12-21T16:13:59+05:30 IST

ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ రెండు రోజుల పాటు విజయవాడలో బస చేయనున్నారు.

AP: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఉమెన్ చాందీ భేటీ నేడు

అమరావతి: ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఉమెన్ చాందీ రెండు రోజుల పాటు విజయవాడలో బస చేయనున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆహ్వానితులు, సీనియర్ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం ఏపీసీసీ  కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పీసీసీ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1గంట నుంచి 3 గంటల వరకు పలువురు పార్టీ ముఖ్య నాయకులతో ఉమెన్ చాందీ సమావేశం కానున్నారు.

Updated Date - 2021-12-21T16:13:59+05:30 IST