శ్మశానంలో ఊట

ABN , First Publish Date - 2022-01-29T06:00:52+05:30 IST

మండలంలోని వెంకట తిమ్మా పురం గ్రామంలో శ్మశానం ఊటెక్కింది.

శ్మశానంలో ఊట

ధర్మవరంరూరల్‌, జనవరి 28: మండలంలోని వెంకట తిమ్మా పురం గ్రామంలో శ్మశానం ఊటెక్కింది. దీంతో సమాధుల మధ్య నీరు నిల్వ ఉండి ఎవరైనా మృతి చెందితే ఖననం చేయడానికి తీవ్ర ఇబ్బం దు పడాల్సి వస్తోంది. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు మరవ పారింది. చెరువుకు సమీపంలో శ్మశానం ఉండటంతో నీరు ఊరి సమా ధుల మధ్య నిల్వ ఉంటోంది. అంతేకాక శ్మశానంలో ముళ్లపొదలు పెరి గి ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ముళ్లపొ దలు, ఊటనీరు తొలగించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-29T06:00:52+05:30 IST