హుజూరాబాద్‌లో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-22T06:03:25+05:30 IST

హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.

హుజూరాబాద్‌లో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభం

హుజూరాబాద్‌, అక్టోబరు 21: హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం తాత్కలిక ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో త్వరలో ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 1.22 కోట్ల రూపాయలతో నిర్మించిన రైతుబజార్‌, మున్సిపల్‌ ఆధ్వర్యంలో నీళ్ల ట్యాంకర్లు, అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఫౌంటెయిన్‌ను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. చెల్పూర్‌లో జూపాక సింగిల్‌విండో చైర్మన్‌ అనుమాండ్ల శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

Updated Date - 2020-10-22T06:03:25+05:30 IST